చిక్కడపల్లి, ఆగస్టు 26: రాష్ట్రంలోని అసంఘటితరంగ కార్మికులందరికీ గుర్తింపుకార్డులు అందజేస్తామని తెలంగాణ కార్మిక సామాజిక భద్రతామండలి చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి తెలిపారు. అసంఘటితరంగ కార్మికుల వివరాల నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక పోర్టల్ ఈ-శ్రమ్ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని కార్మికశాఖ కార్యాలయంలో సలావుద్దీన్ అనే డ్రైవర్కు గుర్తింపుకార్డును అందజేశారు. అసంఘటితరంగ కార్మికులంతా తమ వివరాలను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించుకోవాలని దేవేందర్రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం కేంద్రం ఈ పోర్టల్ను రూపొందించిందని బోర్డు కార్యదర్శి, జంటనగరాల సంయుక్త కార్మిక కమిషనర్ ఇ గంగాధర్ పేర్కొన్నారు. 150 క్యాటగిరీల కార్మికులు ఈ పోర్టల్లో తమ పేర్లను నమోదుచేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని 6,500 కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లలో పేర్లను నమోదుచేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. 16 నుంచి 59 ఏండ్లలోపు వారు ఈ కార్డుకు అర్హులని తెలిపారు.