హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తన అసమర్థతను దాచి గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ గురివింద సామెతను గుర్తు చేశారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని మండిపడ్డారు.
వరంగల్ సభలో ఆయన ప్రసంగం ఆద్యం తం అవాస్తవాలు, వక్ర భాష్యాలు తప్ప మరేం లేదని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.