హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని టీఎన్జీవోల బృందం గురువారం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్కుమార్ను, ఇతర ఉన్నతాధికారులను కలిసింది. అనంతరం ఆయన మాట్లాడు తూ.. 30% పీఆర్సీ అందుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రులకు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు చెప్తున్నామని అన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఒకేరోజు 84 జీవోలు ఇవ్వడం దేశచరిత్రలోనే తొలిసారని చె ప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కొత్త జిల్లాల్లో జనా భా ప్రాతిపదికన ఉద్యోగులను నియమించాలని, ఉద్యోగులను స్థిరీకరించాలని సీఎస్ సోమేశ్కుమార్ను కోరామన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఎకడివారు అకడే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పగా ఆయ న సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్పై కమిటీ వేయాలని సీఎం కేసీఆర్ను కోరగా సానుకూలంగా స్పందించారని, పాత సీనియారిటీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.