వేములవాడ టౌన్, ఆగస్టు 23: శ్రావణమాసం చివరి సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. రాజన్న దర్శనానికి 75 వేల మందికిపైగా భక్తులు తరలిరావడంతో సోమవారం అర్ధరాత్రి 12 వరకు అనుమతించారు. కోడె మొక్కుల టికెట్ల ద్వారా రూ.14.58 లక్షలు, ప్రసాదాల ద్వారా రూ.12.33 లక్షలు, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రూ.6.33 లక్షలు, మెయిన్ బుకింగ్ ద్వారా రూ.3.25 లక్షలు, ధర్మశాలల ద్వారా రూ.1.29 లక్షలు సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.