Telangana | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రూ.లక్ష సాయం పథకానికి మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. https://tsobmm sbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు. వివరాలకు సంబంధిత జిల్లా మైనార్టీ అధికారి, కార్పొరేషన్ కార్యాలయ అధికారిని 040 23391067ను సంప్రదించాలన్నారు.
మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించడంపై రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒమర్ జలీల్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.