హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా విద్రోహ యాత్ర అని తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. రాష్ర్టానికి నయాపైసా తీసుకురాని సంజయ్ ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సంజయ్ ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు సమాధానం చెప్పి యాత్ర చేయాలన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా, తపస్సులు చేసినా రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. బండి సంజయ్ పట్టించుకోకపోవడంతోనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని, అలాంటి పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు.