దుబ్బాక టౌన్, జూన్ 13: సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కారు దవాఖాన వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. సిద్దిపేట మండలం బూరుగుపల్లికి చెందిన సడిమేల సంతోషి సంతానలేమితో బాధపడుతూ పలు దవాఖానలు తిరిగింది. ఎక్కడికి వెళ్లిన సమస్యకు పరిష్కారం దొరకలేదు. పైగా, కడుపులోని గడ్డతోపాటు గర్భసంచి తొలగించాలని పలువురు డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం దుబ్బాక దవాఖానకు వెళ్లింది. డాక్టర్ హేమ్రాజ్సింగ్ పరీక్షలు చేశారు. సోమవారం దవాఖానలో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించకుండానే రెండు కిలోల గడ్డ (ఫైబ్రాయిడ్)ను తీశారు. ప్రస్తుతం సంతోషి ఆరోగ్యంగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు.