హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు మరో చీఫ్ ఇంజినీర్ రంగరాజన్ బదిలీపై వచ్చారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ గెజిట్ ప్రకారం రెండు రివర్ బోర్డుల్లోనూ తెలుగు రాష్ర్టాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు ఉండకూడదు. ఈ నేపథ్యంలో జీఆర్ఎంబీలో చీఫ్ ఇంజినీర్గా ఉన్న వెంకటసుబ్బయ్యను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బదిలీ చేయడంతో ఆయన స్థానంలో రంగరాజన్ను నియమించారు.