ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 6 : ఆమె చదువుల తల్లి… పదిలోనే పెండ్లి అయింది. కానీ తన చదువును ఆపలేదు. పదో తరగతి సప్లిమెంటరీలో పాసయ్యారు. ఇద్దరు పిల్లలు సం తానం అయ్యాక కూడా చదువుపై తనకున్న ఇష్టాన్ని వదులుకోలేదు. ఆమె తన భర్త ప్రోత్సాహంతో పీహెచ్డీ వరకు చదివి ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా అందుకొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన దేవరపోగు రమణమ్మ తెలుగులో పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ సూరంపూడి సుధ పర్యవేక్షణలో ‘తెలుగు సాహిత్యంలో శకుంతల’ అనే అం శంపై రమణమ్మ పరిశోధన చేశారు. ప్రస్తుతం రమణమ్మ పరిగిలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త డాక్టర్ కే వెంకటేశ్వర్లు బేగంపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.