హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లగా.. 74 పోలీస్ స్టేషన్లను షార్ట్లిస్ట్ చేశారు. ఆ 74లో మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్ముకశ్మీర్కు చెందిన షేర్ఘరి, వెస్ట్బెంగాల్ రాష్ర్టానికి చెందిన సెరంపూర్ (చందన్నగర్ కమిషనరేట్) పోలీస్ స్టేషన్లు నిలిచాయి.
ఉత్తమంగా నిలిచిన ఈ మూడు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఈ నెల 5న జైపూర్లోని ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్’లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అవార్డు ప్రదానం చేయనున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కాన్ఫరెన్స్ సెక్రటరీ అండ్ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు సమాచారం ఇచ్చారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉన్నదని రాజేంద్రనగర్ ఎస్హెచ్వో బీ నాగేంద్రబాబు తెలిపారు. ఈ విజయం మా స్టేషన్లో విధులు నిర్వర్తించిన ప్రతి ర ఒక్క సిబ్బందికి ఈ విజయం అంకితమని పేర్కొన్నారు.