హైదరాబాద్: రాష్ట్రాన్ని మరోసారి వరణుడు పలుకరించనున్నాడు. రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు (Rain Forecast) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేకపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇక గురు, శుక్రవారాల్లో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హనుకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.