హైదరాబాద్ : 14 ఏండ్ల క్రితం కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. అనాటి దీక్షతో ఢిల్లీ పునాదులు కదిలాయని, అహింసా మార్గంలోనే కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. చావునోట్లో తలపెట్టిన కేసీఆర్లాగా పోరాడాలంటే.. ఎంతో గుండె దమ్ము కావాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు.
ఎత్తిన జెండా దించను.. దించితే నన్ను రాళ్లతో కొట్టండి అని ధైర్యంగా పోరాడారు. భారత రాజకీయాల్లో 75 సంవత్సరాల్లో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ ఒక ఎజెండాతో వచ్చి.. లక్ష్యం కోసం సాహసోపేత అడుగులు వేసిన పార్టీ బీఆర్ఎస్ అని రాధారపు సతీష్ కుమార్ తెలిపారు. 14 ఏండ్లుగా నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు.