బీఆర్ఏవోయూ వీసీకి వినోద్కుమార్ లేఖ
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉపాధి అవకాశాలు పెంచే నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ఈ దిశగా వర్సిటీ పాలకవర్గం దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ వీసీ సీతారామారావుకు లేఖ రాశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా స్మార్ట్స్కిల్స్, ఆఫీస్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (పర్సనల్ అసిస్టెంట్)గా రాణించేందుకు విస్తృత అవకాశాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఏవోయూలో కొత్త గా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టి, ఇందుకనుగుణంగా కరిక్యులం, డిజైన్ చేయాలని సూచించారు.
ముస్లిం అడ్వకేట్లకు ప్రాధాన్యం ఇవ్వండి
న్యాయవ్యవస్థలోని పలు పోస్టుల్లో ముస్లిం అడ్వకేట్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు ముస్లిం అడ్వకేట్ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్బోర్డు సభ్యుడు వహీ ద్ అహ్మద్ బుధవారం వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ముస్లిం న్యాయవాదులు ఎవరూ లేరని చెప్పారు. కార్యక్రమంలో ఫోరం సభ్యు లు నాజిర్ అహ్మద్ఖాన్, మీర్ వాజిదలీఖాన్, మహ్మద్ సాజిదలీ, ఇంతియాజ్ ఫైజీ, టీఎస్ఎంఎఫ్సీ మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.