హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూటీఎస్ మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డిని నిలిపారు. సంఘం నియామళి ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతో చెన్నకేశవరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు ఆదివారం ప్రకటించారు. చెన్నకేశవరెడ్డి 2017-18 కాలంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2011 -17 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, టీటీ జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీఎల్ నర్సింహారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్టు పేర్కొన్నారు.