హైదరాబాద్, జ నవరి 10 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీ నగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ (ఎన్ఐటీ) డైరెక్టర్గా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర స్తుతం ఆయన జమ్ముకశ్మీర్లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్కు వైస్ చాన్స్లర్గా వ్యవహరిస్తున్నారు.
ఎన్ఐటీకి డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ సుధాకర్ పదవి నుంచి వైదొలగడం తో.. రవీంద్రనాథ్కు అదనపు బాధ్యతలు అ ప్పగించారు. పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. రవీంద్రనాథ్ గతంలో ఓయూ ఇం జినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు.