Chicken Price | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కిలో రూ.200 నుంచి రూ.240 వరకు ఉన్న కిలో కోడి మాంసం ధర.. ఆదివారం రూ.300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.320కు పెరిగింది. లైవ్ కోడి ధర కిలో రూ.220 నుంచి రూ. 250 వరకు, నాటు కోడి రూ.500 వర కు పలికింది. ఒక్కో కోడిగుడ్డును రూ. 6 నుంచి రూ.7 వరకు విక్రయిస్తున్నా రు. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, రానున్న రోజుల్లో కిలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపారులు, పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. ప్రస్తు తం వేసవి తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని, దీనికి తోడు దాణా రేట్లు కూడా పెరగడం చికెన్ ధరల పెరుగుదలకు కారణమని చెప్తున్నారు.