హైదరాబాద్, జూన్27(నమస్తే తెలంగాణ): ప్రముఖ గేయరచయిత మిట్టపల్లి సురేందర్ మాభూమి ప్రజా సాహిత్య పురసారానికి ఎంపికయ్యారు. మాభూమి సాహితీ సాంసృతిక చైతన్య వేదిక సమన్వయకర్త నరసింహ ప్రసాద్ గొర్రెపాటి శనివారం ఈ విషయం తెలిపారు. కవిసామ్రాట్ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి సందర్భంగా, దాశరథి కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథుల సమక్షంలో ఈ పురసారాన్ని మిట్టపల్లికి ప్రదానం చేయనున్నారు. 2024లో గోరటి వెంకన్న, 2025లో ప్రముఖ కవి జయరాజ్ ఈ పురసారానికి ఎంపికైనట్టు కమిటీ సభ్యులు జూపూడి ఉదయ శంకర్, యానాల నాగిరెడ్డి, ముసు పవన్కుమార్ రెడ్డి తెలిపారు.