పుదుచ్చేరి సీఎం డమ్మీ.. తమిళిసైదే అంతా
మాజీ సీఎం నారాయణస్వామి ఆరోపణలు
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరిలో తమిళిసై సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, దీంతో ముఖ్యమంత్రి రంగస్వామి డమ్మీ అయిపోయారని విమర్శించారు.
పుదుచ్చేరిలో హత్యలు, చోరీలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు.