Suryapet | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం( Heavy Rain ) కురిసింది. మఠంపల్లి మండలం( Mattampally Mandal )లో కల్లాల్లో ఉంచిన మిర్చి పంట( Mirchi Crop ) పూర్తిగా తడిసి ముద్దైంది. అటుగా వెళ్తున్నపోలీసులు( Police ) పెద్ద మనసు చాటుకున్నారు. ఈదురుగాలుతో కూడిన వర్షానికి తడుస్తున్న మిర్చి పంటను పట్టాలతో కప్పేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకు( Farmers ) పోలీసులు సహాయం అందించారు. కల్లాల్లోని మిర్చి రాసులపై పట్టాలు కప్పి, అన్నదాతలకు అండగా నిలిచారు. వర్షాన్ని లెక్కచేయకుండా రైతులకు సాయం అందించిన పోలీసులపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అక్కడ బందోబస్తుకు వెళ్లిన ఎస్ఐ రవికుమార్( SI Ravi Kumar ) తిరిగి వెళ్తుండగా రైతుల కష్టాలను గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా.. ఎస్ఐ రవికుమార్ తన వాహనాన్ని రోడ్డుపై ఆపి సిబ్బందితో కల్లాల్లోకి వెళ్లి పట్టాలు కప్పి, రైతులకు అండగా నిలిచారు.