హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ‘అబద్ధాల మోదీ.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్? కేంద్ర బడ్జెట్ను గమనిస్తే.. అబద్ధపు హామీలు.. డొల్లతనం బయటపడ్డాయి’ అని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
ప్రధాని మోదీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని గురువారం సికింద్రాబాద్-కంటోన్మెంట్ పరిధిలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’ పేరుతో భారీ హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో హోర్డింగ్లు పెట్టడం చర్చనీయాంశమైంది.