అమరావతి : ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని చంద్రబాబు సంబరాలు చేసుకున్నారు.
మున్సి పల్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా ఎన్నికలు జరుగుతాయనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించలేదని ఆరోపించారు.
పరిషత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పారిపోయారని అన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి