హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్ రెండో విడత వెబ్కౌన్సెలింగ్ షెడ్యూల్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది.
ఈ నెల 27, 28 న వెబ్ ఆప్షన్లకు అవకాశమివ్వగా, అక్టోబర్ 3న సీట్లు కేటాయిస్తారు.మొదటి విడత పూర్తికాగా, ప్రస్తుతం 4,284 సీట్లు రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీచేస్తారు.