హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, సివిల్, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, మొత్తం 92.01శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు సెట్ కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. వరంగల్, హైదరాబాద్ పట్టణాల్లోని పరీక్షాకేంద్రాల్లో రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షలు జూన్ 1 వరకు కొనసాగుతాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ రవీంద్రారెడ్డి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. ఈ పరీక్షల ద్వారా ఎంటెక్, ఎంఈ, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.