హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్)లో పలు సంస్కరణలు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. దీంట్లోభాగంగా నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఈవెంట్స్ను తగ్గించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పీఈసెట్ను తక్కువ ఈవెంట్స్తో నిర్వహించాలని, అభ్యర్థులకు ఇబ్బందిగా ఉన్న వాటిని రద్దు చేయాలని సూచించింది. బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలను 2004లో ఇచ్చిన జీవో-168 ప్రకారం చేపడుతున్నారు. అయితే ఈ మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేసేందుకు, అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ కమిటీని నియమించింది. పాలమూరు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ రమేశ్బాబు, ప్రొఫెసర్ రాజేశ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండు కోర్సులకు పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. మొత్తంగా 2 వేల సీట్లుంటే, 700 సీట్లు కూడా భర్తీ కావడంలేదు. ఈ నేపథ్యంలో ఈ సీట్లకు డిమాండ్ పెంచడం, ప్రవేశ పరీక్షను సులభంగా నిర్వహించడంపై ఈ కమిటీ ఇటీవలే కసరత్తు చేసింది. ఇటీవలే సమావేశమైన ఈ కమిటీ పలు సూచనలు, సిఫారసులను సూచించింది. ఆయా సిఫారసులను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.
సిఫారసులివే..