మహబూబ్ నగర్: సమాజంలో శాంతి స్థాపనకు బుద్ధుని మార్గమే ఆచరణీయ మార్గమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ క్రిస్టియన్ పల్లి సమీపంలో ఉన్న గౌతమ బుద్ధనగర్ లో ఏర్పాటుచేసిన గౌతమ బుద్ధుడు, సామ్రాట్ అశోక విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం బుద్ధ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చివరికి గెలిచేది అహింసేననీ, సమతా వాదమే పరిష్కారమని గౌతమ బుద్ధుడు నిరూపించాడని పేర్కొన్నారు. జాతి, కుల, వర్ణ, వర్గ విభేదాలు, కక్షలు, కార్పణ్యాలతో సతమతమయ్యే సమాజంలో శాంతి, సమానత్వమే బుద్ధుని మార్గమని తెలిపారు.