సూర్యాపేట : పలుసార్లు గంజాయిని రవాణా చేస్తూ పట్టబడినా తీరుమార్చుకోని వ్యక్తిపై సూర్యాపేట పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బిహార్కు చెందిన మహమ్మద్ మోహిద్ (25) కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. సదరు వ్యక్తి ఈ నెల 25న వైజాగ్ పరిసర ప్రాంతం భీమిలి వద్ద గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తుండగా కోదాట రూరల్ పోలీస్స్టేషన్ పరిధి ఆంధ్రా తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం వద్ద 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు.
దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇంతకు ముందు గంజాయి రవాణా చేస్తూ జైలుకు వెళ్లినట్లు తేలింది. దీంతో పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇక ముందు ఎవరైనా నిషేధిత పదార్థాలతో వ్యాపారం చేస్తూ చట్టాన్ని అవహేళన చేసినా, ప్రజారోగ్యానికి, ఆహార భద్రతకు, ప్రజా వ్యవస్థకు భంగం కలిగించినా పీడీ యాక్ట్ మోపుతామని హెచ్చరించారు. గురువారం కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి సిబ్బందితో కలిసి హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలుకు నిందితున్ని తరలించారు.