మహబూబాబాద్ : రాష్ట్రంలో మతాల(Religion ) పేరుతో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలను ప్రజలు తరమికొట్టాలని మహబూబాబాద్ శాసన సభ్యుడు బానోత్ శంకర్ నాయక్( MLA Shankar Naik) ప్రజలను కోరారు. రంజాన్(Ramzan) పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన రంజాన్ కానుకలను(Ramzan Gifts)గురువారం స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేశారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో మైనార్టీల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని వెల్లడించారు. మైనార్టీలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని కోరారు. మానుకోట పట్టణంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చానని, దర్గాలు, మజీదులకు నిధులు మంజూరు చేశారనని పేర్కొన్నారు.
స్మశాన వాటికలను అభివృద్ధి చేశానని, వక్ఫ్ భూమలు ఆక్రమణకు గురి కాకూండా చర్యలు తీసుకున్నానని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ ఎం.డి.ఫరీద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.