హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన కల్లు గీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న లక్ష్మణ్రావుగౌడ్ మాట్లాడుతూ.. గౌడన్నల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు.
మూతపడ్డ కల్లు దుకాణాలను తెరిపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో గౌడన్నలకు వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి రమణగౌడ్, అధ్యక్షుడు బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.