నందికొండ, మార్చి 20 : నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం థీమ్ పార్కులో పాత రాతి యుగం ఆనవాళ్లు కనిపించినట్టు పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువు అరుణోతో కలిసి బుద్ధవనంలో కృష్ణానది తీరం వెంట సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం సర్వే చేస్తుండగా, పాతరాతియుగపు బింగిరాయిని గుర్తించినట్టు చెప్పారు. ఈ రాయిని ఆదిమ మానవులు పనిముట్టుగా వాడినట్టు తెలిపారు. క్రీస్తు పూర్వం 2.6 నుంచి 1.6 మిలియన్ సంవత్సరాల్లో ఇలాంటి పనిముట్లను ఆదిమానవులు వాడారని, ఆ దశను అచూలియన్గా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటారని తెలిపారు. ఆయన వెంట బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, సహాయ శిల్పి శ్యాంసుందర్ ఉన్నారు.