హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): వేములవాడలో రూ.20 కోట్లతో కొత్తగా నిర్మించిన 100 పడకల దవాఖాన కోసం ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మనీ నుంచి 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తెప్పించారు. ఈ దవాఖానలో వైద్యసేవలు ఇంకా అందుబాటులోకి రానందున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అవసరమైన వారికి వినియోగించాలని సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్కు గురువారం వాటిని అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.