హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు చదువు పూర్తికాగానే ప్లేస్మెంట్స్ కల్పించాలని ఇంటర్ విద్య అధికారులు నిర్ణయించారు. దాంతో ఇంటర్ చదువుతూనే ఇంటర్న్షిప్కు అవకాశం ఇస్తున్నారు. వొకేషనల్ కోర్సు ‘రిటైల్ మార్కెటింగ్’ పూర్తిచేసిన వారికి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇందుకు రిలయన్స్ సంస్థ సహకారాన్ని తీసుకొంటున్నారు. రిలయన్స్ స్టోర్స్, మాల్స్లలో ఇంటర్న్షిప్ పూర్తికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత దశలవారీగా రిలయన్స్ డిజిటల్, ఫార్మాలోనూ ఇంటర్న్షిప్ కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల కోరిక మేరకు వాటిల్లోనే ప్లేస్మెంట్స్ ఇస్తారు. ఇలా 2,600 మంది విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్న్షిప్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.