హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి 18 వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 9న నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ)కు హాజరైన వారు ఈ ప్రవేశాలకు అర్హులు అని చెప్పారు. ఈ నెల 18న జాబితా విడుదల, 20న సర్టిఫికెట్ల పరిశీలన, 21, 22న సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 25 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభిస్తామని వర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ వనజ తెలిపారు.