సూర్యాపేట : గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట( Suryapet) జిల్లాలోని మద్దిరాల మండలం మామిళ్ల గ్రామంలో భారీగా నల్ల బెల్లం నిల్వ చేశారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Enforcement officers) దాడులు నిర్వహించారు.
63 బస్తాల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. బెల్లం సరఫరా చేసిన డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిషేధిత నల్ల బెల్లం అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.