శ్రీశైలం : శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లకు.. తమిళనాడు రాష్ట్రం మైలపూరులోని కపిలేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం మహాద్వారం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎస్ లవన్న ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.
అనంతరం తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పి.శేఖర్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాయిలతో ఆలయ ప్రవేశం చేసి స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో తమిళనాడు పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ ముఖ్య కార్యదర్శి డా.బి. చంద్రమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కుమార్ గురువన్,తిరుమళన్, కావేరి వేద పండితులు పాల్గొన్నారు.