హైదరాబాద్ డిసెంబర్31(నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సరం సందర్భంగా తనకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపేందుకొచ్చే అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలబొకేలు, శాలువాలు తీసుకురావ్దొని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఒకరోజులోనే వాడిపోయే పూలు, జారిపోయే శాలువాలు కాకుండా రేపటితరానికి వెలుగును పంచే జ్ఞాన జ్యోతులైన పుస్తకాలు, నోట్ బుక్లు తీసుకొస్తే సంతోషిస్తానని చెప్పారు. నోటు పుస్తకాలను విద్యార్థులకు చేరవేస్తానని.. అవి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.