ములుగు : జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటిస్తున్నది. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద నున్న హరిత గ్రాండ్ హోటల్కు చేరుకున్న బృందం సభ్యులు డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన న్యూట్రిషన్ సెంటర్ను ప్రారంభించి ప్రేమ్ నగర్లోని మోడల్ అంగగన్వాడీ సెంటర్ను సందర్శించనున్నారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ములుగు మండలం ఇంచర్ల గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల, హెల్త్ సబ్ సెంటర్, జి.పి కార్యాలయాన్ని సందర్శించనున్నారు.
ఆ తర్వాత వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తరలి వెళ్లనున్నారు.