హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డుకు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ సత్యకుమార్ ఎంపికయ్యారు. గ్రావిమెట్రి, స్ట్రక్చర్, టెక్టోనిక్స్, రిమోట్ సెన్సింగ్, ప్లానెటరీ జియోసైన్సెస్ పాలియోమాగ్నెటిజం రంగాల్లో విశేష సేవలకు 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డు ప్రకటించింది. భూమి, మహాసముద్రం, వాతావరణం, పర్యావరణ శాస్ర్తాల్లో అందించిన సేవలకు గాను ఎంపిక చేసింది. సత్యకుమార్ ఉపగ్రహ గురుత్వాకర్షణ డాటా ఉపయోగించి భూమి, గ్రహాల డీప్ సబ్ సర్ఫేస్ నిర్మాణం, రిమోట్ సెన్సింగ్, గురుత్వాకర్షణ డేటా నుంచి రిఫ్ట్ బేసిన్ల నిర్మాణం, టెక్టోనిక్ లక్షణాలపై విస్తృతంగా పరిశోధన చేశారు.