Rain Alert | రాగల రెండురోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్క తేలికపాటి నుంచి మోస్తరు వానలుపడుతాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.