దుండిగల్, ఆగస్టు 9 : దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ (ఎన్బీఏ) టైర్-1 హోదాను పొందింది. ఎంఎల్ఆర్ఐటీ మొదటిసారిగా 2013లో ఎన్బీఏ అక్రిడేషన్ పొందగా, 2019లో, 2022లో ఎన్బీఏ టైర్-1 హోదా సాధించింది. దీంతో కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. 2005లో ప్రారంభమైన ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తమ కళాశాలకు ఎన్ఏఏసీ- ఏ గ్రేడ్ లభించిందని, ఎన్బీఏ టైర్-1 హోదా లభించడం తమ కళాశాలలో పాటిస్తున్న అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. ఎన్బీఏ టైర్-1 హోదా తిరిగి లభించడం గొప్ప విషయమని, 2022లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 94శాతం మంది నియామకాలు సాధించారని, మొత్తం 1250 పైచిలుకు విద్యార్థులు ఉద్యోగావకాశాలు సాధించి తమ కళాశాల రికార్డు సృష్టించిందని తెలిపారు.