హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు పంపిణీ సంస్థలైన డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి, సాంకేతికత ఆధారంగా వాటికి జాతీయస్థాయిలో గ్రేడ్లు ప్రకటించారు.
కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ విడుదల చేసిన 12వ వార్షిక నివేదికలో మహారాష్ట్రకు చెందిన ఏఈఎంఎల్ (ప్రైవేటు) 99.9 స్కోర్తో ఏ+ గ్రేడ్లో నిలవగా.. తెలంగాణకు చెందిన ఎస్పీడీసీఎల్ 19.9 స్కోరింగ్తో సీ గ్రేడ్లో, ఎన్పీడీసీఎల్ 17.9 స్కోరింగ్తో సీ గ్రేడ్లో నిలిచాయి. జాతీయ స్థాయిలో ఇవి 44, 46 ర్యాంకుల్లో ఉన్నాయి.