హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నవరత్న ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ జాతీయస్థాయిలో పలు పబ్లిక్ రిలేషన్స్ అవార్డులను సాధించింది. హౌస్ జర్నల్ (హిందీ), మహిళాభివృద్ధిలో సీఎస్ఆర్ ప్రాజెక్టు, సుస్థిరాభివృద్ధి నివేదిక, వార్షిక నివేదిక తదితర అంశాల్లో ఈ అవార్డులు దక్కించుకుంది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్-2023 సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సోనల్ మాన్సింగ్ ఎన్ఎండీసీ అధికారులకు అవార్డులను బహూకరించారు.