పెద్దపెల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నరసింహులపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. గ్రామంలో వీధి వీధి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని అంటు వ్యాధులను దరిచేరనీయొద్దన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నెల నెలా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తుందన్నారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.