హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించే నిమిత్తం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా సీనియర్ న్యాయవాది బీ నరసింహశర్మ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేరొంటూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
1959 నవంబర్ 22న పుట్టిన బీఎన్ శర్మ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం చేసి బంగారు పతకాన్ని సాధించారు. 1982లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గత ఏడాది సీనియర్ న్యాయవాది అయ్యారు.