వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 3: ‘వడిగల రెండెద్దులు కట్టుక, మడిదున్నుక బ్రతుకవచ్చు’ అనే కలను సాకారం చేశామని, రాబోవు తరాలకు తిండి గింజలు, బతుకు దెరువు చూపడమే మన ముందున్న సవాళ్లని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రా జేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 9వ వ్యవస్థాపక దినోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ‘సుస్థిరాభివృద్ధి- వ్యవసా యం’ అనే అంశంపై శ్రీకృష్ణదేవరావు మాట్లాడు తూ వ్యవసాయ వర్సిటీ పేరును సార్థకం చేస్తూ అ నతి కాలలోనే రైతులకు అండగా అనేక రూపకల్పనలు చేసిందని కొనియాడారు. సుస్థిర వ్యవసా యం ప్రస్తుతం చాలా అవసరమని చెప్పారు. ఆహ ర భద్రత కోసం ప్రత్యేక వ్యూహాలు కావాలని తెలిపారు. వ్యవసాయరంగానికి విశేష సేవలు చేసిన ఐకార్ మాజీ డీడీజీ ఈఏ సిద్ధిఖీకి పీజేటీఎస్ఏయూ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.