నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్టు గేట్లను మూసివేశారు. సాగర్లో ప్రస్తుతం 45,578 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, 311.74 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.