జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడించిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, జీఆర్ చింతల గురువారం మేడిగడ్డ బ్యారేజ్లను సందర్శించనున్నారు.