ముస్తాబాద్, జూన్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్బర్ (గూగీ ప్రాపర్టీస్ అధినేత) శనివారం రూ.రెండు లక్షల విరాళం అందజేశారు. 800 ఏండ్ల చరిత్ర గల ఈ ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరిస్తుండగా, ఈ నెల 20న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే మతసామరస్యం వెల్లివిరిసేలా రామాలయానికి విరాళమిచ్చిన అక్బర్కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.