ముస్తాబాద్, జూన్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజైన ఆదివారం ఆలయంలో చతుష్ఠాన అర్చన, గర్తపూజ, రత్నన్యాసం, యంత్ర, బింబస్థాపన, అన్నమయ్య కీర్తాలాపన, సుందరకాండం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు నవీన్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు రంగారావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు ఎరవెల్లి చంద్రశేఖర్రావు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.