నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శ
ఖలీల్వాడి, ఆగస్టు 31: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సెప్టిక్ట్యాంక్తో సమానమని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్లో మాట్లాడారు. చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అతను వేసుకున్న దుస్తులు, ఆయన బిడ్డ తాగినపాలు టీడీపీ డబ్బుతోనేనని అనుకుంటున్నామని చెప్పారు. రేవంత్ వాలకం చూస్తే దొంగేదొంగ అని అరిచినట్టు ఉన్నదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి చరిత్రను మంత్రి మల్లారెడ్డి మొత్తం చెప్పారని, ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.