MP Arvind | డిచ్పల్లి, అక్టోబర్ 15: సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు. కార్డుదారుడు ఏ విధంగా మరణించినా బీమా అందజేస్తామని స్పష్టం చేశారు. దీనికి ‘కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా’ అని పేరు పెట్టారు. అయితే, ఈ బీమాతో తమ ఓటమి తప్పదని భావించిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అసహనంతో ఊగిపోయారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఆదివారం అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, కవిత చస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా కింద డబ్బులు తాను ఇస్తానంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
బీమాపై భయమెందుకు?
తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నదాతలు, గీత, చేనేత కార్మికుల కోసం బీమాను అమలుచేస్తున్నారు. ఈ బీమా అనేది ఏ ఒక్కవర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు అమలు చేయాలని కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా’ పథకాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇందుకు సంబంధించిన డబ్బలును ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. పేద ప్రజలందరికీ మంచి పథకం తెస్తామని చెప్తే స్వాగతించాల్సిందిపోయి ఎంపీ అర్వింద్ విషం చిమ్మారు. ఓటమి భయంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడి, ప్రజల్లో చులకనైపోయారు. తెలంగాణలో ఏ నిరుపేద కుటుంబమూ పెద్ద దిక్కు కోల్పోతే రోడ్డున పడొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన బీమాను చూసి అర్వింద్, బీజేపీ భయపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.